సలాం సైనికా..
గుర్తుంచుకుంటాం మా ఊపిరిపోయేదాకా..
ఎండలో మానై ఎండిపోతున్నారు మనకు నీడనిస్తూ...
ఎండిన పిదప మోడై కాలిపోతున్నారు మన చలిని కాస్తూ...
హరివిల్లై గొడుగు పడుతున్నారు మన తడుపును కాస్తూ..
వడగల్లై చల్లని సౌఖ్యమిస్తున్నారు తమ సుఖమొదిలేస్తూ..
భారతావనిని మోస్తున్నారు తమ భుజాలు కాస్తూ..
నేత్రాలకు నిద్రిస్తున్నారు సరిహద్దుల వెంబడి కాపల కాస్తూ..
ఊపిరొదిలేస్తున్నారు మనకు ఊపిరిపోస్తూ..
శవాలల్లే మారుతున్నారు వారి దేహమడ్డేస్తూ..
అతనెవరో నీకు తెలుసా?....
నీరసమే నీరస పరచినా, దేశభక్తే ఒంటినిండా..
ఆహారమే లేకున్నా, "జై భారత్" నోటినిండా..
కనురెప్పలు మూతబడుతున్నా కారం కొడుతూ కునుకేయకుండా..
మండే గుండు గుండెను చీల్చిన, గుండెల నిండా దేశపు జెండా..
దేహం మొత్తం నేలకొరిగినా అనుకున్నావన్నా
"నాకేమవుతుంది భరతమాత ఒడినేనుండా"..
వరికంకులు మనకిచ్చి దుబ్బులుగా మారిన 40 మంది సైనికుల మరణం
కొరివి మడులైపోయెను వారి కుటుంబాల జీవితం
ఇలా కన్నీటి కవితగా మలిచింది నాకలం- పుల్వామా దాడి నాలో రేపిన కలకలం
ప్రాణం పెట్టిన వారికోసం పది నిముషాలైనా మౌనం పాటిస్తావని ఆశిస్తూ..
జై జవాన్..........జై కిసాన్..............
రచన : బి.దుర్గబాబు
IIIT Nuzvid.
7995721404
కొరివి మడులైపోయెను వారి కుటుంబాల జీవితం
ఇలా కన్నీటి కవితగా మలిచింది నాకలం- పుల్వామా దాడి నాలో రేపిన కలకలం
ప్రాణం పెట్టిన వారికోసం పది నిముషాలైనా మౌనం పాటిస్తావని ఆశిస్తూ..
జై జవాన్..........జై కిసాన్..............
రచన : బి.దుర్గబాబు
IIIT Nuzvid.
7995721404